Showing posts with label Satavahanas. Show all posts
Showing posts with label Satavahanas. Show all posts

Tuesday, November 10, 2020

 సమాజం 

 Hi friends! Are you searching for  Satavahanas their rule of the system of socialism PART-2(శాతవాహనలు వారి  పరిపాలన విధానం సామజిక స్యరూపం).After Reading  Please do share it with your friends. Learn More GK Topics


 సమాజం 

→ అప్పట్లో చతుర్ వర్ణ వ్యవస్థ ఉండేది . కానీ సాధారణ ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించుట కారణంగా వర్ణ వ్యవస్థ సమాజంపై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు .
• 
బ్రాహ్మణులకు అత్యున్నత స్థానం కల్పించబడింది .

• విదేశీ తెగ వారైన ' శకులు శాతవాహన సమాజంలో కలవడాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి అడ్డుకున్నాడు . అందువలన గౌతమిపుత్ర శాతకర్ణి కు ' వర్ణ సంకర్యనిరోధక ' అను బిరుదు ఇవ్వబడింది . అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది

• 'ధిమిక ' అనే చర్మకారుడు తన కుటుంబ సమేతంగా అమరావతి స్థూపాన్ని సందర్శించి పూర్ణ కుంభమును సమర్పించాడు . కుల పెద్దలను గుహపతులనేవారు 
• 
నాగానిక , గౌతమీ బాలశ్రీలు పరిపాలనలో పాల్గొన్నారు . అప్పట్లో అనేక మంది మహిళా కవియిత్రులు ఉండేవారు

ఉదా : రేవతి , మాధవి , అనులక్ష్మీ
స్త్రీలు తమ భర్తలతో యజ్ఞయాగాదులలో పాల్గొనేవారు  మహిళలకు మత స్వేచ్ఛ కల్పించడింది . .భర్తల బిరుదులు పొందేవారు .
ఉదా : మహాభోజకివీరికి ఆస్తిహక్కు కూడా కల్పించబడింది .

• గౌతమీ బాలశ్రీ ' భద్రయాన కొండ పై బౌద్ధ విహార నిర్మాణానికి విరాళం ఇచ్చింది .

 హాలుడు తన గాధా సప్తసతిలో మహిళల గురించి వ్యతిరేకగా పేర్కొన్నాడు.

• ఉట్లేషం ( తలపాగ ) ను ధరించేవారు

•  కుసుమవన్నె ( బెంగాళీ చీరలు ) అంటే స్త్రీలకు మోజు ఎక్కువ
•  
జంట నాట్యాలు , బృంద నాట్యాలు వీరి ప్రధాన వినోదాలు .
• 
అధికారులు జూదమాడేవారు .
• 
అప్పట్లో పితృస్వామ్య సమాజం ఉండేది

• రాజరికం కూడా పితృస్వామికమే ఉండేది .
ఆర్థిక వ్యవస్థ
 • 
రాజ్యానికి ప్రధాన ఆదాయం - భూమిశిస్తు అందువల్లనే శాతవాహనులు వ్యవసాయ అభివృద్ధికి . కృషి చేశారు
• 
ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేయుటకు ఒక సాంకేతిక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశారు . దీనిని ఓదయంత్రిక ' అంటారు .
• 
ఓదయంత్రిక  క్రింది పనిముట్లను రూపొందించింది .
1. 
ఉదక యంత్రంభూమిని దున్నేయంత్రం
2. 
ఘటియంత్రంనీటిని పైకి లాగడానికి
3. 
ఘటిక యంత్రం  :ముడి పత్తి నుండి విత్తనాలు వేరు చేయు యంత్రం

• రజ్జగాహకుడు భూమి శిస్తును నిర్ణయించి  శిస్తును వసూలు చేసేవాడు . భూమి శిస్తును భాగ లేదా దేయమేయ అనేవారు .

• ఇది సాధారణంగా 1/6  వంతు ఉండేది . చేతివృత్తుల వారి పై విధించే పన్నును కురుకర ' అనేవారు . అప్పట్లో 18 వృత్తి శ్రేణి వారు లేదా అష్టదశ వర్ణాలవారు ఉండేవారు . ఉదా :

→ హాలక : పొలం దున్నే వాడు / వ్యవసాయదారుడు .

 కొలికనేతపనివాడు

→ కులరికకుమ్మరివాడు :

→ ఇనుము పనివాడు :

గంధిక : నుగంధ పరిమళాలు తయారి చేసేవాడు

→ VEJA వైద్యుడు

→ వస్సాకర : వెదురు పనివాడు .

→ శిలవధికశిలలు చెక్కేవాడు

→ తిలపిశక : నూనే తీసేవాడు

→ మెరుగు పెట్టేవాడు

→ మణికార : రత్నాలు,మణులు పొదిగి నగలు తయారు చేసేవాడు

→ మాలాకార : మాలలు కట్టి విక్రయించేవాడు

 → వధిక : వడ్రంగి

Also Check

Satavahanas their rule of the system of socialism part-1

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)

→ అప్పట్లో విదేశీ వర్తకం బాగా అభివృద్ధి చెందింది . రోమ్ దేశంతో వర్తకం జరిగేది . ' రోమ్ దేశం యొక్క బంగారం అంతా భారతదేశానికి తరలిపోతుందని " ప్లీని పేర్కొన్నాడు .

→ విదేశీ వర్తకం లేదా సుదూర ప్రయాణాలు చేసి వర్తకం వారిని సార్ధవాహకులు అంటారు . స్వదేశీ వర్తకం కూడా బాగా అభివృద్ధి చెందింది

 స్వదేశీ వర్తకులు సంఘాలుగా ఏర్పడేవారు .  సంఘాలనే నిభయ లేదా నికాయ లేదా నిగమ అనేవారు  సంఘాలు నిర్వహించే సమావేశాన్ని గోష్టి అనేవారు

 → గోష్టి అధ్యక్షుడు - శెట్టి

→ శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసనాణెలు ముద్రించబడ్డాయి

 • పొటీన్ అనే మిశ్రమ లోహనాణేలు కూడా ముద్రించారు .

• బంగారు నాణేలు సువర్ణాలు • వెండి నాణేలు - కర్షపణాలు

• ఒక బంగారు నాణెం →  35 వెండి నాణేలతో సమానం .

→ అప్పట్లో వడ్డీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది . వడ్డీ వ్యాపారస్తులు 12% వడ్డీను వసూలు చేసేవారు→ అప్పట్లో శాతవాహనుల అతిముఖ్యమైన ఓడరేవు - బారుకచ / బ్రోచ్ ( గుజరాత్ ) తూర్పు తీరంలో అతి ముఖ్యమైన ఓడరేవు మోటుపల్లి

 • శాతవాహనుల కాలంలో వైదిక , జైన , బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి . 

వైదిక మతం :

• శాతవాహన రాజులు వైదిక మతాన్ని పాటించగా రాణులు బౌద్ధమతాన్ని ఆదరించేవారు .

• ఒకటో శాతకర్ణి , రెండో శాతకర్ణి , GPS , యజ్ఞశ్రీ శాతకర్ణిలు అనేక యజ్ఞయాగాదులను నిర్వహించారు .

• నాగానిక యొక్క నానాఘడ్ శాసనంలో అనేక మంది వైదిక దేవుళ్ళ గురించి పేర్కొనబడింది . ఉదా : ఇంద్రుడు , అగ్ని , వరుణుడు , కుబేరుడు .

• శాతవాహన రాజు కనుడు కాలంలో భాగావత మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది .

 హాలుడు తన గాధాసప్తశతిలో అనేక విష్ణు కథలు పేర్కొన్నాడు .

• గాధాసప్తశతి పుస్తకం శివుని ప్రార్ధనతో ప్రారంభమై పార్వతి ప్రార్ధనతో అంతం అవుతుంది .

 A.P. లో అతి ప్రాచీన శివలింగం - చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఇది శాతవాహనుల కాలం నాటిది . ఇష్టదైవాలను , పురాణ పురుషులను పూజించే పౌరాణిక మతం వీరికాలంలోనే ప్రారంభమయింది .

 జైనమతం : 

శాతవాహన రాజ్యస్థాపకుడైన శ్రీముఖుడు మొదట్లో ఒక జైనమతాభిమాని

• అశోకుడి మనవుడు సంపాతి ( జైన అశోకుడు ) వడ్డయాన కొండ పై జైన బసది నిర్మించాడు .

•A.P. లో మొట్టమొదట జైనాచార్యుడు - కొండకుందా చార్యుడు . ఇతను సమయసారం అనే గ్రంథాన్ని రచించాడు .

బౌద్ధమతం :

 రాణులు , వర్తకులు , సాధారణ ప్రజలు బౌద్ధమతాన్ని పాటించారు . వర్తకులు బౌద్ధమతాన్ని పాటించుటచే ఇది అత్యంత ధనిక మతంగా మారింది .A.P. లో మొట్టమొదటి బౌద్ధాచార్యుడుమహాదేవ భిక్షువు ఇతను బుద్దుని జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజించే ' చైత్యక వాదం ' అనే సంప్రదాయంను ప్రవేశపెట్టాడు .

• A.P. లో అతి ప్రాచీన చైత్యం - గుంటుపల్లి

• ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని జీలకర్రగూడెంలో ఉంది
• 
గుంటుపల్లి చైత్యంను మౌర్యుల కాలంనాటి బరాబరా గుహల'తో పోల్చుతారు • ఆరామం : స్థూపం , విహారం , చైత్యం , విద్యాలయం ఒకే చోట ఉంటే  ప్రాంతాన్ని ఆరామం అంటారు
• 
ఉదాహరణకు కడపలోని నందలూరు చిత్రలేఖనం :
•  
శాతవాహనుల కాలంలో చిత్రలేఖనం కూడా అభివృద్ధి చెందింది . అజంతా గుహలలో 9 , 10 గుహలలోని చిత్రలేఖనం శాతవాహనులకు చెందినది .

• జాతక కథలలోని బుద్ధుని జీవిత చట్టాలను చిత్రలేఖనంగా చెక్కారు
 శాతవాహనులు అధికార భాష - ప్రాకృతం

 ప్రాకృతం సామాన్యుల భాష 

  కాలం ప్రాకృతానికి స్వర్ణయుగం , 

 ఆంధ్ర ప్రాకృతాన్నే పైశాచిక ప్రాకృతం అంటారు .

 సంస్కృతంలో గ్రంథాలను శర్వవర్మ , ఆచార్య నాగార్జునుడు మాత్రమే  కాలంలో వ్రాశాడు .

తెలుగు భాష :

 D.C. సర్కార్ ప్రకారం  కాలంలో ప్రస్తావించబద్ద దేశీ బాషే తెలుగు అని పేర్కొన్నాడు 

• శాతవాహనుల కాలంలోనే తెలుగు భాష ఆవిర్భవించింది .
•  
తెలుగులో మొట్ట మొదటి వదం ' నాగబు ' అమరావతిలోని ఒక శాసనంలో ఉంది .
• 
హాలుని గాధా సప్తశతిలో 40 కు పైగా తెలుగు పదాలు ఉన్నాయి . ఉదా : అందంఅత్త ,పొట్ట ,అద్దం .

   కార్తికేయ శర్మగారు  పదాలు తెలుగు పదాలు అని పేర్కొన్నాడు .

 పులోమావి అనగా గడ్డిలో జన్మించినవాడు . ఇది తెలుగు పదం .

 బౌద్ధ మతం కారణంగానే శాతవాహనుల వాస్తు అభివృద్ధి చెందింది . 

 - బౌద్ధమత నిర్మాణాల్లో ప్రధానమైనవి . 

 స్తూపం : -

  స్థూపం అనగా బుద్ధుడు కాని అతని శిష్యుల ధాతువులపై అర్ధ చంద్రాకారంలో నిర్మించిన నిర్మ పశ్చిమ గోదావరి ) , సంగారం ( విశాఖ ) ఉద్దేశిక స్థూపాలు .

  అలెగ్జాండర్ రే సంగారంలో త్రవ్వకాలు నిర్వహించాడు . 

  ఇక్కడ సముద్ర గుప్తుడి నాణాలు ధ్యానబుద్ధ , హారతిబుద్ధ విగ్రహాలు దొరికాయి .

 చైత్యగృహం : - 

→  పూజా వస్తువుగా స్థూపంగాని,బౌద్ధ విగ్రహం గాని వుంటే దానిని చైత్యగృహం అంటారు .

→ ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీన చైత్యం - గంటుపల్లి ( పశ్చిమ గోదావరి ) 

అమక స్థంభాలు : - బుద్దుని జీవితంలోని ఐదు గుర్తులకు చిహ్నంగా 5 స్థంభాలు నిర్మించారు . 

జననం తామర 

మహాభినిష్క్రమణం గుర్రం

సంబోధి ( జ్ఞానోదయం ) రావిచెట్టు

తొలి ధర్మబోద చక్రం

మదణం స్థూపం 

విహారం : - 

  వర్షాకాలంలో బౌద్ధ బిక్షువులు నివాసం కోసం ఉపయోగించేవి విహారాలు . 

→  ఇవి చతురస్రాకారంలో వుంటాయి . 

ఆరామం : -

 స్థూపం , చైత్యం , విహారం , విద్యాలయం , అయక స్థంభాలు ఒకచోట వుంటే దానిని ఆరామం అంటారు రామతీర్థం విహార సంగారామాన్ని అలెగ్జాండర్ 1908-09లో కనుగొన్నాడు . 

  ఆంధ్రలో 40 విహారాలు వున్నాయి అని హుయాన్త్సాంగ్ పేర్కొన్నాడు . 

 అమరావతి స్థూపం :

 ఇది గుంటూరు జిల్లాలో వుంది . ' అమరావతికి  పేరు పెట్టింది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు . 

 దీనిని ధాన్యకటకం , ఆంధ్రనగరి , పూర్వ శైలము,ధరణికోట,శ్రీస్థాన ,వజ్రపర్వతం మొ || పేర్లుతో పిలుస్తారు . 

 అమరావతి స్థూపం 142 అడుగులు ఎత్తు , 162 అడుగుల వ్యాసంతో వుంది . 

 1797 లో కల్నల్ క్యాలిన్ మెకంజి దీనిని కనుగొన్నాడు . 

 మహదేవ భిక్షు నలుడు లేదా నాగ అశోకుడి సహాయంతో నిర్మించాడు . అతడు అశోకుడి ధర్మమహామాత్రుడు అని కొందరి చరిత్రకారుల అభిప్రాయం . 

 దీనిని వశిష్టపుత్ర రెండోపులోమావి నిర్మించాడు . దీనికి పూర్ణకుంభాన్ని దిమీక అనే చర్మకారుడు సమర్పించాడు .

 ఆచార్య నాగార్జునుడు దాన్యకటక మహాచైత్యానికి శిలాప్రాకారం నిర్మించాడు .

 అమరావతి తొలి దశ సాంచి శైలిలోను రెండో దశ గాంధార శైలిలోను వుంటుంది ,

  శైలికి అమరావతి శైలి అని జాన్ మార్షల్ పేరు పెట్టాడు . 

 అమరావతి శైలి భారత శిల్పకళకే పరాకాష్ట అని ఫర్గుసన్ పేర్కొన్నాడు . 

  స్థూపంపై నలగిరి దమన,ఆనంద పిందక జాతక కథలు చెక్కబడ్డాయి .

 మంజుశ్రీ ములకల్ప ప్రకారం బుద్ధుని అవశేషాలు ఇక్కడ వున్నాయి . 

 నాగార్జున కొండ :

1926 లో A.R. సరస్వతి ఇక్కడ త్రవ్వకాలు నిర్వహించాడు  ఇక్కడ ప్రాచీన , మధ్య , నవీన శిలాయుగ అవశేషాలు లభ్యమయ్యాయి . 

 దీనిని బహు సంస్కృతుల ప్రాంతం అంటారు . 

 చిత్రలేఖనం : -

  మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో అజంతా గుహలలో 8 , 9 , 10 , 12 , 13 నెంబర్ల గుహలలో చిత్రలేఖనాలు శాతవాహనుల కాలానికి చెందినవి . 

 9  గుహలో నల్లయువరాణుల చిత్రాలు వున్నాయి , 

 10  గుహలో శ్వేతగజజాతక చిత్రం వుంది 

 

 

  

 

Topics

Popular Posts

Recent Posts